భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ తో తొలి మరణం

భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ తో  తొలి మరణం

ఫస్ట్ టైం డెల్టా ప్లస్ వేరియంట్ తో ఇండియాలో ఓ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ మరణం నమోదైంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో ఐదుగురికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. ఇందులో నలుగురు కోలుకోగా.. ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి ఇంకా కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు. కోలుకున్న నలుగురు అంతకుముందే టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ డెల్టా ప్లస్ వేరియంట్ వారిని అటాక్ చేసింది. దీంతో టీకా తీసుకున్న వాళ్లుకూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు హెల్త్  ఎక్స్ పర్టులు.