![వాచ్మన్ పై మేడిపల్లి ఎస్సై దాడి](https://static.v6velugu.com/uploads/2023/07/Madipally-SI-attack-on-watchman_lRiLSb8dBq.jpg)
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ సర్వే నం. 85లోని పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్యాదవ్కు చెందిన భూమిలోని ప్రహరీని మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగా, కబ్జాదారులు తమ యజమాని భూమిలోని గోడను కూల్చుతున్నా పోలీసులు చూస్తున్నారే తప్ప ఏమీ అనడం లేదని వాచ్ మన్ఎల్లయ్య వాపోయాడు.
దీంతో ఆగ్రహానికి గురైన మేడిపల్లి ఎస్సై ప్రభాకర్రెడ్డి.. ఎల్లయ్య మెడ, వీపుపై గుద్దుతూ వెహికల్ఎక్కించి స్టేషన్కు తరలించాడు. అనంతరం పోలీసులు ఎల్లయ్యను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లి టెస్టులు చేయించారు.