సైన్స్ పై విద్యార్థులకు అవగాహన ఉండాలి : కలెక్టర్‌‌‌‌ అద్వైత్ కుమార్ సింగ్

సైన్స్ పై విద్యార్థులకు అవగాహన ఉండాలి : కలెక్టర్‌‌‌‌ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు:  విద్యార్థులు సైన్స్​పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌‌‌‌ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని అనంతారం మోడల్ స్కూల్​లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా ఆయన హాజరయ్యారు. విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకొని అభినందించారు. వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని చెప్పారు.  చదువుల్లో బట్టీ పద్ధతిని వీడి, పాఠ్యాంశాలను అర్థం చేసుకోవాలని చెప్పారు.  సైన్స్​ఎగ్జిబిషన్​లో 85 ఇన్ స్పైర్, 230 బాల వైజ్ఞానిక  ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు డీఈవో దక్షిణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, టీచర్లు పాల్గొన్నారు.

చెక్కు, చీరలు పంపిణీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్​లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.2.70 కోట్ల విలువైన చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందించారు. రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలకు  చీరలు పంపిణీ చేశారు.