అన్ని వార్డులను కైవసం చేసుకుంటాం : ఎమ్మెల్యే మురళీనాయక్ ధీమా

అన్ని వార్డులను కైవసం చేసుకుంటాం :  ఎమ్మెల్యే మురళీనాయక్ ధీమా

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్​లో 32 వార్డులను కాంగ్రెస్​ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మురళీనాయక్​ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం డీసీసీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సర్వే చేసి అర్హులైన అభ్యర్థులకు కాంగ్రెస్​ తరఫున బీ ఫామ్​లను అందజేశామని తెలిపారు.

సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి చేపడతామని, ఇప్పటి వరకు మహబూబాబాద్​లో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరారు. మున్సిపాలిటీలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో రూ.20కోట్లతో తాగునీటి కోసం, రూ. 60 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించామని వివరించారు.  ప్రెస్​మీట్​లో డీసీసీ అధ్యక్షురాలు ఉమామురళీనాయక్, కాంగ్రెస్​ లీడర్లు  పాల్గొన్నారు.