స్పెషల్​ గ్రాంట్స్ గురించి తెలియదట

స్పెషల్​ గ్రాంట్స్ గురించి తెలియదట

మహబూబ్ నగర్​, వెలుగు :  మహబూబ్ ​నగర్​ జిల్లా పరిషత్​ లోకల్​ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  కిందటి  నవంబర్​లో  ప్రభుత్వం ఫండ్స్ ​ను రిలీజ్​ చేసింది. ఈ స్పెషల్​ గ్రాంట్స్ ను​ లీడర్లు ఉపయోగపడటం లేదు. ఈ ఫండ్స్​  గురించి ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు  తెలియకపోవడం ఆశ్చర్యం.కొన్ని చోట్ల  జనరల్​ వర్క్స్​ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్  అనుమతులు వచ్చినా పనులు స్టార్ట్​ కాలేదు.   గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, బోరు మోటార్లు, జడ్పీహెచ్​ఎస్​ లు , మండల పరిషత్​ స్కూళ్లు,  యూపీఎస్ ​లలో డెవలప్​మెంట్​ పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉంది. కానీ, ఇంత వరకు జనరల్​ కోటా కింద 76 పనులకు, ఎస్సీ కోటా కింద 18 పనులకు, ఎస్టీ కోటా కింద 16 పనులకు   అడ్మినిస్ట్రేటివ్ ​ అనుమతులు ఇచ్చారు. మూడు నెలలు పూర్తి కావస్తున్నా, ఎలాంటి పనులూ  చేయడం లేదు.   మండల పరిషత్​ ల   పరిధిలో కూడా ఇప్పటి వరకు  ఈ నిధులతో పనులు చేసేందుకు అడ్మినిస్ట్రేటివ్ ​ అనుమతులు కూడా ఇస్తలేరు.

అటా ఇటా? 

స్పెషల్​ గ్రాంట్స్​ ఏ పనులకు  కేటాయించాలనే డైలమాలో  ఆఫీసర్లు ఉన్నారు.  ఈ ఫండ్స్ ​తో 50 శాతం నిధులు ‘మన ఊరు–మన బడి’కి వినియోగించాలని, మిగతా 50 శాతం నిధులను జనరల్​ వర్కులకు కేటాయించాలని నెలన్నర కిందట కమిషనర్​ నుంచి గైడ్ లైన్స్ ​ వచ్చాయి.  అందుకు తగినట్లు ఆఫీసర్లు ‘మన ఊరు–మన బడి’ స్కీం  పనులను గుర్తించి ఎస్టిమేషన్లు రెడీ చేశారు. కానీ,  ఈ స్కీంకు విడతల వారీగా కలెక్టర్​ ఫండ్స్​ రిలీజ్​ చేస్తున్నారు. దీంతో ఆఫీసర్లు ‘మన ఊరు–మన బడి’కి కేటాయించిన ఫండ్స్ ​ను ఏ పనులకు వినియోగించకుండా హోల్డ్ ​లో పెట్టారు. మిగతా 50 శాతం నిధులను జనరల్​ వర్క్ ​కు కేటాయించాల్సి ఉన్నా,  వాటిని కేవలం మెయింటెనెన్స్ లకే వినియోగించాలని ఉన్నతాధికారుల నుంచి  నుంచి ఆర్డర్లు రావడంతో డెవలప్​మెంట్​ పనులకు   కేటాయించడం లేదు.

సభ్యులకు సమాచారం కూడా లేదు

జడ్పీ స్పెషల్​ గ్రాంట్స్​ కింద   నిధులు విడుదలైనా, ఇప్పటి వరకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలకు సమాచారం లేదు. ఈ నిధులతో   చేస్తున్న పనుల గురించి కొందరు సభ్యులను ప్రశ్నించగా, వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.  ఆ నిధులేంటివో తెలియదని, ఆఫీసర్లను అడిగి కనుక్కుంటామని సమాధానం ఇస్తున్నారు. ఇంకొందరితో మాట్లాడగా 15వ ఫైనాన్స్​ కింద మార్చిలో ఇచ్చిన వర్కులను పూర్తి చేశామని, స్పెషల్ గ్రాంట్స్​ నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి పనులు కేటాయించలేదని తెలిపారు.

గైడ్ ​లైన్స్​ ప్రకారం ఫండ్స్​ కేటాయిస్తాం

ప్రభుత్వం ఏ నిధులు విడుదల చేసినా, ఆ నిధులకు సంబంధించిన విధి విధానాలను జారీ చేస్తుంది. దాని ప్రకారమే నిధుల కేటాయింపులు చేస్తాం. విలేజ్​ విజిట్ ​కు వెళ్లినప్పుడు గ్రామ సభల్లో తమ దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు వెచ్చిస్తాం. అలాగే మండల సభల్లో సభ్యులు ‌‌చేసుకున్న తీర్మానాలకు సంబంధించిన పనులకు కూడా నిధులు కేటాయిస్తాం.

- స్వర్ణా సుధాకర్ ​రెడ్డి, జడ్పీ చైర్​ పర్సన్​, పాలమూరు