
- 25వేల మంది ప్రైవేట్ డాక్టర్లను కోరిన మహారాష్ట్ర సర్కార్
ముంబై: మహారాష్ట్రలో రోజు రోజుకు పెరిగిపోతున్న కేసులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పేషంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25వేల మంది ప్రైవేట్ డాక్టర్లను కోరింది. డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ అందించినందుకు గాను డబ్బులు చెల్లిస్తామని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీఎమ్ఈఆర్) చెప్పింది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం హాస్పిటల్స్ అన్ని మూత పడ్డాయని, దీంతో ప్రైవేట్ డాక్టర్లను కూడా ట్రీట్మెంట్కు ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్పారు. “ కరోనాను తరిమికొట్టేందుకు కనీసం 15 రోజులు మీ సేవలు కావాలి. మీరు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారు అనే వివరాలను డాక్టర్ మిలింద్ కంబాలేకు చెప్పండి. డ్యూటీకి హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటాం” అని డీఎమ్ఈఆర్ డైరెక్టర్ టి.పి. లహానే అన్నారు. మన దేశంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. కాగా.. మహారాష్ట్రలోనే అత్యధింగా 16వేల కేసులు నమోదయ్యాయి. వాటిలో కేవలం ముంబైలోనే 10వేల కేసులు ఉన్నాయి.