- ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ఔరంగాబాద్: కనీసం ఒక డోస్ వ్యాక్సిన్వేసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించిన వారికి మాత్రమే రేషన్, గ్యాస్ ఇవ్వాలని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టీకా తీసుకోనోళ్లకు పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని బంకుల ఓనర్లకు సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో రాష్ట్రంలోని 36 జిల్లాల్లో ఔరంగాబాద్ 26వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా కలెక్టర్ సునిల్ ఛావన్ ఆధ్వర్యంలోని జిల్లా యంత్రాంగం ఆయా గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, కిరాణా షాప్ల ఓనర్లకు స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు.