సచిన్ కు భద్రత విత్ డ్రా..ఆదిత్య థాక్రేకు పెంపు

సచిన్ కు భద్రత విత్ డ్రా..ఆదిత్య థాక్రేకు పెంపు

భారత మాజీ క్రికెటర్ కు సెక్యూరిటీని విత్ డ్రా చేసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. సచిన్  కు ఇప్పటి వరకు ఉన్నఎక్స్ కేటగిరీ భద్రతను ఎత్తివేసింది. అయితే సచిన్ కు పోలీసు ఎస్కార్ట్ భద్రత ఇచ్చే అవకాశం ఉంది.  రాష్ట్రంలోని 97 మంది ప్రముఖుల భద్రతపై సమీక్షించిన ప్రభుత్వం 29  మంది భద్రతను తగ్గించగా పలువురి భద్రతను పెంచింది.  ఇందులో భాగంగానే సీఎం ఉద్ధవ్ థాక్రే  కొడుకు ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే సెక్యూరిటీని వై కేటగిరి నుంచి జెడ్ క్యాటగిరీకి పెంచింది. అలాగే సామాజిక కార్యకర్త అన్నాహజారే భద్రతను వై ప్లస్ నుంచి  నుంచి జెడ్ కేటగిరికి పెంచింది. యుపి మాజీ గవర్నర్ రామ్ నాయక్ జెడ్ ప్లస్ కేటగిరిని ఎక్స్ కు తగ్గించారు.