శ్రీశైల క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. రోజుకో వాహనంపై ఊరేగుతూ మల్లన్న స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి హంస వాహనసేవ జరగనుంది. సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరపున...స్వామీ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

బుధవారం రాత్రి స్వామీ, అమ్మవార్లను బృంగి వాహనంపై  ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళ తాళాలు, డోలు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కన్నడ కళాకారుల విన్యాసాల మధ్య వాహన సేవ కన్నులపండువగా నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు. శ్రీశైలమంతా శివ నామస్మరణతో మార్మోగింది.ః

For More News..

మీ పిల్లలకు మార్కులు కావాలంటే.. ఓటేయండి