
కోటగిరి, వెలుగు : పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం గ్రామస్తులు సెక్రటరీకి సమాచారం అందించారు. మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు డాక్టర్. ఎంఏ.హకీమ్, ఎంపీడీవో లతో సెక్రటరీ ఫోన్లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులను కోరారు.