సికింద్రాబాద్, వెలుగు: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతూ ఓయూ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి సుమారు రూ.1.30 లక్షల విలువైన 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్జిల్లా కొడంగల్ మండలం భయానా తండాకు చెందిన ముడావత్ శంకర్(25) సిటీకి వచ్చి అంబర్పేట్ ప్రేమ్నగర్లో ఉంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటు పడిన శంకర్ సెల్ఫోన్లుచోరీ చేస్తున్నాడు.
చోరీ కేసుల్లో గతంలో రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతడిలో మార్పు రాలేదు. సోమవారం తార్నాక చౌరస్తాలో పోలీసులు చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్ను చెక్చేయగా11 సెల్ఫోన్లు దొరికాయి. వాటి విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని, శంకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.