సెల్​ఫోన్ల దొంగ అరెస్ట్.. 11 మొబైల్స్​ స్వాధీనం

సెల్​ఫోన్ల దొంగ అరెస్ట్.. 11 మొబైల్స్​ స్వాధీనం

సికింద్రాబాద్, వెలుగు: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి సెల్​ఫోన్ ​చోరీలకు పాల్పడుతూ ఓయూ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి సుమారు రూ.1.30 లక్షల విలువైన 11 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​జిల్లా కొడంగల్​ మండలం భయానా తండాకు చెందిన ముడావత్ ​శంకర్(25) సిటీకి వచ్చి అంబర్​పేట్ ప్రేమ్​నగర్​లో ఉంటూ ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు.  చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటు పడిన శంకర్ ​సెల్​ఫోన్లు​చోరీ చేస్తున్నాడు. 

చోరీ కేసుల్లో గతంలో రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతడిలో మార్పు రాలేదు. సోమవారం తార్నాక చౌరస్తాలో పోలీసులు చెకింగ్​ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్​ను చెక్​చేయగా11 సెల్​ఫోన్లు దొరికాయి. వాటి విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకొని, శంకర్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.