మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు నిర్వహించనున్న 17వ రోడ్డు భద్రతా మాసోత్సవాలను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
అనంతరం రోడ్డు భద్రతపై నినాదాలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. సిబ్బందికి హెల్మెట్లు అందజేశారు. ఆర్టీవో రఘు, ఎంవీఐ వాసుదేవరావు, ఏఎంవీఐ రుబీనా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
