రిస్క్ ఎక్కువ..అందుకే ప్రయోగాలు చేయను

రిస్క్ ఎక్కువ..అందుకే ప్రయోగాలు చేయను

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు  ఒకప్పుడు డిఫరెంట్ సినిమాలు చేసేవాడు. కానీ ఈ మధ్యలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తున్నాడు.  టాలీవుడ్ లో మిగతా స్టార్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్,  అల్లు అర్జున్, రాంచరణ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా సరిలేరు నీకెవ్వరుతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మహేశ్.  అయితే తాను డిఫరెంట్ సినిమాలు ఎందుకు చేయడం లేదో మరోసారి చెప్పాడు మహేశ్.

సినిమాల్లో ప్రయోగాలు బాగానే ఉంటాయి కానీ తేడా వస్తే అందరూ నష్టపోవాల్సి ఉంటుందన్నారు.  ఒక హీరోని నమ్మి వందల కోట్లు పెట్టినప్పుడు అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉండాలన్నారు. ప్రయోగాత్మక సినిమాలు చేయడం ప్రతీ సారీ సాధ్యం కాదన్నారు. తనతో సినిమా చేసే నిర్మాతలు నష్టపోకూడదని..వారి శ్రేయస్సే ముఖ్యం అన్నారు. అందుకే ప్రయోగాత్మక సినిమాలు చేద్దామంటే నిర్మాతలు పెట్టిన వందల కోట్ల పెట్టుబడి గురించి ఆలోచించి వెనకడుగు వేయాల్సి వస్తుందన్నారు. సినిమాకు హీరో, డైరెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అందుకే ప్రయోగాత్మక మూవీలు చేసి తాను రిస్క్ తీసుకోలేనన్నాడు.