పిచ్చి పీక్స్: థియేటర్లో శివాలెత్తిపోతున్న మహేష్ ఫ్యాన్స్.. ఖలేజా సీన్స్ రీ క్రియేట్ చేస్తూ హంగామా

పిచ్చి పీక్స్: థియేటర్లో శివాలెత్తిపోతున్న మహేష్ ఫ్యాన్స్.. ఖలేజా సీన్స్ రీ క్రియేట్ చేస్తూ హంగామా

సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నేడు (మే 30న) మహేష్​ నటించిన ‘ఖలేజా’ రీ రిలీజయింది. మహేష్ బాబు రీ-రిలీజ్ సినిమాలకు ఫ్యాన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే రీ రిలీజ్ వసూళ్ళలో మహేష్ సినిమాలు దుమ్ములేపాయి. 

అందుకు గత సినిమాలే ఉదాహరణ. పోకిరి, బిజినెస్ మెన్, ఒక్కడు, భరత్ అనే నేను.. ఇటీవలే రీ రిలీజైన మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు భారీ సక్సెస్ను నమోదు చేసుకున్నాయి.

ఇక ఇప్పుడు మహేష్ సినిమాల రికార్డ్స్ ను మాత్రమే కాదు.. మిగతా హీరోల రికార్డులను కూడా ఖలేజా బీట్ చేసేలా కనిపిస్తోంది. నిన్న మే29న ప్రదర్శించిన ప్రీమియర్స్ చూస్తేనే అర్ధమవుతోంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ డ్యాన్స్ లతో, అరుపులతోనే కాకుండా సినిమాని మళ్ళీ మళ్ళీ బిగ్ స్క్రీన్పై చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

అంతేకాకూండా.. ఖలేజాలోని పలు సీన్స్ను రీ క్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో మహేష్ వీరాభిమాని ఒకరు థియేటర్లో 'ఖలేజా' హాస్పిటల్ సీన్ని రీ క్రియేట్ చేసి ఆకట్టుకున్నారు. మహేష్ వలే పేషెంట్ మాదిరిగా గౌన్ ధరించి, చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ, మరో చేతిలో ఒక మొక్కని పట్టుకొని.. దీన్ని ఎక్కడ పెట్టుకోను అంటూ డైలాగులు చెబుతున్న ఫన్నీ సీన్ను రీ క్రియేట్ చేశాడు.

ఇంకో అభిమాని అయితే, కాదు కాదు.. పిచ్చి అభిమాని ఐతే.. ఖలేజా ఇంట్రడక్షన్ సీన్లో మహేష్ బాబు పామును పట్టుకొని వచ్చే సీన్ ను రీక్రియేట్ చేయడం కోసం పామును పట్టుకొచ్చాడు. దాంతో ఆ సదరు అభిమాని పైన నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే, అతను థియేటర్లలోకి పామును తీసుకొచ్చిన వీడియోలు మాత్రం బయటకు రాలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇలా ఖలేజా కల్ట్ ఫ్యాన్స్తో థియేటర్ల దగ్గర మహేష్ ఫ్యాన్స్ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రీ సేల్‌‌‌‌‌‌‌‌లో భారీగా టికెట్స్ అమ్ముడుపోవడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. దాదాపు రూ.6కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఈ సందర్భంగా ‘ఖలేజా’ నిర్మాతలు శింగనమల రమేష్, సి. కళ్యాణ్, కృష్ణ గారి సోదరుడు నిర్మాత ఆదిశేషగిరి రావు, నటులు అలీ పాల్గొన్నారు.

నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ‘మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించింది. అలాగే  రీ రిలీజ్ సినిమాల్లో ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది’అని చెప్పారు.

ఈ చిత్రం రీ రిలీజ్ అవడం చాలా ఆనందంగా ఉందని ఆదిశేషగిరిరావు అన్నారు. ఈ సినిమాకు ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని అలీ చెప్పాడు. ఇది ఫ్రెష్ రిలీజ్‌‌‌‌‌‌‌‌లా ఉందని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు.