పెట్రోల్, సీఎన్జీ రెండింటితో నడిచే కమర్షియల్ వెహికల్ సుప్రో సీఎన్జీ డుయోని మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసింది. 750 కేజీల బరువును ఈ బండి మోయగలదు. 75 లీటర్లుండే సీఎన్జీ ఫుల్ ట్యాంక్తో 325 కి.మీ వెళ్లగలదు.
అంతేకాకుండా ఈ బండిలో అదనంగా ఐదు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. మహారాష్ట్రలోని చకాన్ ప్లాంట్లో సుప్రో సీఎన్జీ డుయోని తయారు చేశామని మహీంద్రా ప్రకటించింది.