
మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, దాని ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఎక్స్యూవీ700 లక్షవ యూనిట్ను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. ఈ మైలురాయిని కేవలం 20 నెలల్లోపు సాధించింది. మహీంద్రా పోర్ట్ఫోలియోలో అత్యంత త్వరగా ఈ మైలురాయిని చేరుకున్న ఎస్యూవీగానూ ఇది రికార్డులకు ఎక్కింది.
లాంచ్ చేసిన మొదటి 12 నెలల్లోనే 50 వేల ఎక్స్యూవీ700 యూనిట్లను అమ్మినట్టు మహీంద్రా తెలిపింది.