
బీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జెండా ఎగరేస్తున్న సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయారు.
#WATCH | Hyderabad: Former Telangana Deputy CM Mahmood Ali faints during #RepublicDay2024 celebrations at Telangana Bhawan. pic.twitter.com/GCzoMb9l8U
— ANI (@ANI) January 26, 2024
దీంతో ఇతర నేతలు మహహూద్ అలీని పైకి లేపే ప్రయత్నం చేశారు. వెంటనే ప్రాధమిక చికిత్స అందించి ఇంటికి తరలించారు. మరోవైపు తెలంగాణ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కి్ంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.