సైదాబాద్ ఘటనపై సీఎం సీరియస్సయ్యారు..రివ్యూలో హోంమంత్రి

సైదాబాద్ ఘటనపై సీఎం సీరియస్సయ్యారు..రివ్యూలో హోంమంత్రి

సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య ఘటనపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించామన్నారు. అలాగే.. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామని చెప్పారు. కేసు విచారణకు సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులతో రివ్యూ చేశారు మహమూద్ అలీ.