- స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
తాండూరు, వెలుగు : తాండూరులోని విజయ మూన్ స్కూల్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభను సక్సెస్చేయాలని అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో కలిసి శుక్రవారం సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు.
చేవెళ్ల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు. తాండూరు సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్దీపదాస్, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ,7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొంటారని వెల్లడించారు. సభకు దాదాపు లక్ష మంది తరలిరానున్నారని చెప్పారు.
రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్తాండూర్ ఇన్చార్జ్ మహేశ్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు రమేశ్మహారాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ సునీత సంపత్ పాల్గొన్నారు.
