ఇందూరు మీటింగ్​ను సక్సెస్ చేయండి : ప్రేమేందర్ రెడ్డి

ఇందూరు మీటింగ్​ను సక్సెస్ చేయండి :   ప్రేమేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇందూరు(నిజామాబాద్)లో జరగనున్న జన గర్జన సభను పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని మంగళవారం రాష్ర్ట పర్యటనకు వస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో  ప్రధానిపై, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు, విష ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వాళ్లు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా ప్రజలు నమ్మరని చెప్పారు.