డిసెంబర్​ నుంచి వరుణ్ తేజ్ మట్కా మొదలు

డిసెంబర్​ నుంచి వరుణ్ తేజ్ మట్కా మొదలు

లావణ్య త్రిపాఠితో వివాహం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ తిరిగి తన  సినిమాలతో బిజీ కాబోతున్నాడు. వరుణ్ హీరోగా కరుణ కుమార్‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మట్కా’. మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ను డిసెంబర్‌‌‌‌ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆల్రెడీ  ప్రీ- ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. 

వైజాగ్ బ్యాక్‌‌డ్రాప్‌‌ కథ కావడంతో.. దీనికోసం హైదరాబాద్‌‌లో ఓల్డ్ వైజాగ్‌‌ సిటీని తలపించే భారీ సెట్‌‌ని నిర్మిస్తున్నారు. అంతేకాక.. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.. నలుగురు ఫైట్ మాస్టర్‌‌లు ఆ యాక్షన్ ని పర్యవేక్షిస్తారని దర్శక నిర్మాతలు చెప్పారు.  వరుణ్ తేజ్‌‌ కెరీర్‌‌‌‌లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ‘మట్కా’ అంటే జూదం అని అర్థం. దేశం మొత్తాన్ని కదిలించిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా 1958–-1982 మధ్య జరిగే ఈ కథలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపించనున్నాడు. 

మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.