- 89. 06 శాతం పోలింగ్
- పోలింగ్ కేంద్రాలను విజిట్ చేసిన అడిషనల్ కలెక్టర్, ఎస్పీ
మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులుదీరారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలు, వృద్దులు, యువకులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకే 76.60 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకు 89.06 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, ఎస్పీ వినీత్ సందర్శించా పోలింగ్ సరళిని పరిశీలించారు.
గతంలో 6వ వార్డు ఎన్నికకు ఒక రోజు ముందు బీజేపీ అభ్యర్థి అత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. సోమవారం కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేందర్ గౌడ్ తెలిపారు.

