
మలయాళ యంగ్ డైరెక్టర్ జోసెఫె మను జేమ్స్ మృతి చెందారు. హెపటైటిస్ తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిల్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. జేమ్స్ డైరెక్షన్ చేసిన ఫస్ట్ మూవీ నాన్సీ రాణి త్వరలో రిలీజ్ కానుంది. ఇంతలోనే జేమ్స్ మరణించడంతో మలాయళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. జేమ్స్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో ఐయామ్ క్యూరియస్ సినిమాతో జేమ్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సీని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలకు అసిస్టెంట్, కో డైరెక్టర్ గా పనిచేశారు.