గంజాయి మొక్క పెంచుతున్న..యువకుడి అరెస్ట్

గంజాయి మొక్క పెంచుతున్న..యువకుడి అరెస్ట్

జవహర్​నగర్, వెలుగు: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను పెంచుతున్న యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్​కు చెందిన రాజుశర్మ(25) కొంతకాలం కిందట సిటీకి వచ్చి జవహర్​నగర్ పరిధి ఆనంద్​నగర్​ కాలనీలో ఉంటున్నాడు. పెయింటర్​గా పనిచేసే రాజు తాను ఉండే ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కను పెంచుతున్నాడు. 

సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సోమవారం అతడి ఇంటివద్ద గంజాయి మొక్కను గుర్తించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని, ఆ మొక్కను స్వాధీనం చేసుకున్నారు. రాజుశర్మ గంజాయిని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని జవహర్​నగర్ పోలీసులకు అప్పగించామన్నారు.