
జవహర్నగర్, వెలుగు: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను పెంచుతున్న యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజుశర్మ(25) కొంతకాలం కిందట సిటీకి వచ్చి జవహర్నగర్ పరిధి ఆనంద్నగర్ కాలనీలో ఉంటున్నాడు. పెయింటర్గా పనిచేసే రాజు తాను ఉండే ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కను పెంచుతున్నాడు.
సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సోమవారం అతడి ఇంటివద్ద గంజాయి మొక్కను గుర్తించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని, ఆ మొక్కను స్వాధీనం చేసుకున్నారు. రాజుశర్మ గంజాయిని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని జవహర్నగర్ పోలీసులకు అప్పగించామన్నారు.