
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–3లోని మల్కపేట పంపుహౌస్ ట్రయల్రన్ సక్సె స్ అయింది. దీన్ని మిడ్మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించేందుకు చేపట్టగా.. అప్పర్ మానేరుకు దిగువన ఉన్న రెండో పంపుహౌస్ ట్రయల్ (సింగసముద్రం) రన్ కూడా సక్సెస్అయితే ఈ ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. మల్కపేట రిజర్వాయర్కు దిగువన ఉన్న పంపుహౌస్లోని రెండు మోటార్లలో ఒక మోటారును మంగళవారం ఉదయం 7 గంటలకు ట్రయల్రన్ చేసి నీటిని రిజర్వాయర్కు తరలించారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్లు ట్రయల్రన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 86,150 ఎకరాల ఆయకట్టు కోసం లింక్–3 (ప్యాకేజీ–9) పనులను చేపట్టారు. రూ.911.32 కోట్లతో ఈ పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వగా 2020లో ఇంకో రూ.84.69 కోట్లు పెంచేందుకు అనుమతులు ఇచ్చారు. మూడు టీఎంసీల కెపాసిటీ గల మల్కపేట రిజర్వాయర్ను ఇంకో రూ.566.11 కోట్లతో నిర్మించారు. మొత్తంగా లింక్– 3 పనులు దాదాపు రూ.1,600 కోట్లతో చేపట్టారు. మిడ్మానేరు నుంచి 2.6 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా 12.03 కిలోమీటర్ల పొడవైన టన్నెల్లో నీళ్లు చేరుతాయి. ఈ టన్నెల్ తవ్వకం పనులు సుదీర్ఘంగా సాగడంతోనే ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించిన నాలుగేండ్ల తర్వాత లింక్–3 అందుబాటులోకి వస్తోంది.
నెల రోజుల్లో అందుబాటులోకి..
మల్కపేట రిజర్వాయర్ నుంచి 18.25 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు సింగసముద్రం చెరువుకు చేరుతాయి. అక్కడి పంపుహౌస్లో రెండు పంపులు ఏర్పాటు చేశారు. ఆ పంపుహౌస్ నుంచి 6.59 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా అప్పర్ మానేరుకు నీళ్లు చేరుతాయి. మంగళవారం మల్కపేట రిజర్వాయర్లో 2.25 మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు మోటార్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మోటారును ట్రయల్రన్ చేయగా.. రెండో మోటారును వారం, పది రోజుల్లో ట్రయల్రన్ చేసే ప్రయత్నాల్లో ఇంజనీర్లు ఉన్నారు. సింగసముద్రం పంపుహౌస్లో 2.23 మెగావాట్ల కెపాసిటీ గల రెండు మోటార్లు ఏర్పాటు చేశారు. ఆ రెండు పంపుల్లో ఒక పంపును రానున్న 20 రోజుల్లో ట్రయల్రన్ చేస్తామని, రెండో పంపును నెల రోజుల్లో అందుబాటులోకి తెస్తామని ఇంజనీర్లు తెలిపారు. జూన్ నెలాఖరుకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం లింక్–3 అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిద్వారా ప్రతిపాదిత ఆయకట్టుకు నీళ్లివ్వడానికి 150 చెరువులను నింపుతామని, కాల్వలపై ఇందుకు అవసరమైన తూములు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.