తెలంగాణ సీఎం ఎంపికపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన

తెలంగాణ సీఎం ఎంపికపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన

తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 5న సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామని .. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తామని వెల్లడించారు. 

ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే  ఇవాళ మధ్యామ్నం  మల్లికార్జున ఖర్గే  అధిష్టానం పెద్దలతో సమావేశాలు నిర్వహించనున్నారు.  సీఎం,డిప్యూటీ సీఎం ఎవరన్నది అధిష్టానం ఖరారు చేసిన తర్వాత ఏఐసీసీ పరిశీలకులు మళ్లీ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్ లొనే ముఖ్యమంత్రిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మరో వైపు    భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. 

డిసెంబర్ 4న  సీఎల్పీ భేటీలో  ఎమ్మెల్యేల అభిప్రాయాలను  తీసుకున్నారు ఏఐసీసీ పరిశీలకులు. రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగినా..సీఎం అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంతో వాయిదా పడింది.  దీంతో ఇవాళ సాయంత్రంలో వరకు   సీఎం,డిప్యూటీ సీఎం ఎంపికపై క్లారిటీ రానుంది. 

తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 64 సీట్లు..బీఆర్ఎస్ 39 సీట్లు ,బీజేపీ 8, ఎంఐఎం 7 సీట్లు గెలుచుకున్నాయి.