- ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి
హైదరాబాద్, వెలుగు : ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగు తుంటే ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్.. సభకు హాజరుకాకపోవడం ప్రజలను అవమానపర్చి నట్టేనని ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా..
బయట సభలు పెట్టి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. మాట్లాడేందుకు ఎంత సమయమైనా ఇస్తామని చెప్తున్నప్పటికీ.. కేసీ ఆర్ సభకు రాకుండా మొహం చాటేయడం దారుణమన్నారు. నల్గొండలో సభ పెట్టి చెప్ప డం కన్నా.. అసెంబ్లీకి వచ్చి ఏం చెప్పా లనుకున్నారో చెప్పొచ్చు కదా అని నిలదీశారు.
కృష్ణా జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. కృష్ణా జలాలను భారీగా ఏపీకి తరలిస్తున్నా కేసీఆర్ చూస్తూ కూర్చున్నారని ఆరోపించారు. కేఆర్ఎంబీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాస్తవాలను దాచేస్తున్నారన్నారు.