
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్కు మధ్య గొడవ రచ్చకెక్కింది. తన ట్విట్టర్ అకౌంట్లో గవర్నర్ ను బ్లాక్ చేసినట్టు మమత సోమవారం ఓ ప్రెస్కాన్ఫరెన్స్లో చెప్పారు. కొంతకాలంగా వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ‘పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యానికి ఒక గ్యాస్ చాంబర్లా మారుతోంది’ అంటూ గవర్నర్ ఇటీవల చేసిన కామెంట్స్కలకలం రేపాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ఆయన ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.“నేను ముందుగా క్షమాపణలు చెబుతున్నా. ఆయన(గవర్నర్) ప్రతిరోజూ నన్ను లేదా మా ఆఫీసర్లను అబ్యూస్చేస్తూ ఏదో ఒక ట్వీట్ చేస్తారు. రాజ్యాంగ విరుద్ధమైన, అనైతిక విషయాలు మాట్లాడతారు. సలహాలు ఇవ్వడానికి బదులు ఆర్డర్లు జారీ చేస్తుంటారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని బాండెడ్లేబర్గా చూస్తారు. అందుకే నాకు ఇరిటేషన్వచ్చి ట్విట్టర్అకౌంట్బ్లాక్చేశా” అని మమతా బెనర్జీ మీడియాతో అన్నారు. చాలాసార్లు సీఎస్ను, పోలీసు చీఫ్ను గవర్నర్ బెదిరించారని అన్నారు. ధన్ఖర్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి పలుమార్లు లేఖలు కూడా రాశామన్నారు. కాగా, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానవ హక్కులను కాలరాసే ల్యాబ్గా, రక్తపాతంతో నిండిన దుర్భర భూమిగా బెంగాల్ను చూడలేమని అన్నారు.