రామనవమి వేడుకల్లో బీజేపీ హింసను ప్రేరేపించింది : బెంగాల్ సీఎం మమత

రామనవమి వేడుకల్లో బీజేపీ హింసను  ప్రేరేపించింది :  బెంగాల్ సీఎం మమత

హరిహరపాఢా: బెంగాల్​లో రామనవమి వేడుకల సందర్భంగా బీజేపీ హింసను ప్రేరేపించిందని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ హింస, రక్తాపాతాన్ని మాత్రమే నమ్ముకుందని తెలిపారు. ముర్షీదాబాద్ జిల్లాలోని హరిహరపాఢాలో ఎన్నికల ర్యాలీలో ‘దీదీ’ మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 

ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉనికికే ప్రమాదమని ప్రజలను హెచ్చరించారు. ఈ లోక్ సభ ఎన్నికలు రెండో స్వాతంత్ర్య సమరం కంటే తక్కువేమీ కాదని పేర్కొన్నారు. రామనవమి సందర్భంగా ముర్షీదాబాద్​జిల్లాలో చోటుచేసుకున్న హింసకు ముందే ప్లాన్ చేశారని, ఈ గొడవలో 19 మంది గాయపడ్డారని చెప్పారు.