- మద్యం మత్తులో ఢిల్లీ ఎయిర్పోర్ట్లోఓ ప్రయాణికుడి నిర్వాకం
- అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్ డిపార్చర్ ఏరియా గేట్ వద్ద ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బీహార్కు చెందిన జౌహర్ అలీ ఖాన్ ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మామ్కు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చాడు. మద్యం మత్తులో డిపార్చర్ ఏరియాలో గేట్ నంబర్–6 వద్ద బహిరంగంగా యూరిన్ పాస్చేశాడు.
అంతేకాకుండా గట్టిగా అరుస్తూ తోటి ప్రయాణికులను దుర్భాషలాడాడు. దీంతో ప్యాసింజర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఖాన్ను సఫ్దర్జంగ్ హాస్పిటల్కు తరలించి టెస్టులు చేయించారు. మద్యం మత్తులో ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.