ఎయిర్​పోర్ట్ గేట్​దగ్గర పాస్​ పోసిండు

ఎయిర్​పోర్ట్ గేట్​దగ్గర పాస్​ పోసిండు
  • మద్యం మత్తులో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్​లోఓ ప్రయాణికుడి నిర్వాకం
  • అరెస్ట్​ చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్​ఎయిర్‌‌పోర్ట్‌‌ డిపార్చర్ ఏరియా గేట్ వద్ద ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బీహార్‌‌కు చెందిన జౌహర్ అలీ ఖాన్ ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మామ్​కు వెళ్లేందుకు ఎయిర్‌‌‌‌పోర్టుకు వచ్చాడు. మద్యం మత్తులో డిపార్చర్ ఏరియాలో గేట్ నంబర్–6 వద్ద బహిరంగంగా యూరిన్​ పాస్​చేశాడు.

అంతేకాకుండా గట్టిగా అరుస్తూ తోటి ప్రయాణికులను దుర్భాషలాడాడు. దీంతో ప్యాసింజర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఖాన్‌‌ను సఫ్దర్‌‌జంగ్ హాస్పిటల్​కు తరలించి టెస్టులు​ చేయించారు. మద్యం మత్తులో ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.