పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై దాడి

పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై దాడి

హాలియా, వెలుగు : తనను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానంటూ ఓ యువతిపై వ్యక్తి దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం నల్గొండ జిల్లా అనుముల మండలం పులిమామిడి గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కలకుంట్ల మధుసూదన్‌‌‌‌కు ఇప్పటికే పెళ్లి అయింది. అయినా తనను పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా అక్కడికి వచ్చిన వ్యక్తి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లాడు.

ఊరి శివారులోకి వెళ్లాక తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే తనతో పాటు, కుటుంబ సభ్యులను కూడా చంపేస్తానని బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో యువతి కళ్ల కింది భాగంతో పాటు, కుడి భుజంపై గాయాలు అయ్యాయి. తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లడంతో ఇంటికి చేరుకున్న ఆ యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్‌ ఐ శివకుమార్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు