ఫ్రెండ్​ రక్తం తాగాలనుకుండు... లాస్ట్ కు బలైండు

ఫ్రెండ్​ రక్తం తాగాలనుకుండు... లాస్ట్ కు బలైండు

మద్యం మత్తులో కొందరు రాక్షసులకంటే అధ్వానంగా మారిపోతారు. ఒకడు మద్యం మత్తులో ఏకంగా దోస్త్​ రక్తం తాగాలనుకున్నాడు. చివరికి ఆ దోస్త్​ చేతిలోనే హత్యకు గురైండు. ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ జిల్లాలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రాహుల్ లోహర్ తన స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లాడు. మద్యం మత్తులో అతని స్నేహితుల్లో ఒకరైన ఇష్తియాక్ ఖాన్... రాహుల్ రక్తం తాగాలనుకున్నాడు. 

వెంటనే రాహుల్ మెడపై కొరకడంతో.. ఇది ఇరువురి మధ్య గొడవకు దారితీసింది. అనంతరం రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ కొన్ని గంటల తర్వాత మళ్లీ ఇస్తియాక్‌ను కలిసేందుకు వచ్చాడు. "నువ్వు నా రక్తం తాగాలనుకుంటున్నావా.. నిన్ను ఇప్పుడు బతకనివ్వను" అని ఇస్తియాక్‌కి చెప్పి రాయితో తల పగులగొట్టి చంపేశాడు. 

రాహుల్ లోహర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.