దహెగాం, వెలుగు: కన్న తల్లి చనిపోయి పుట్టెడు దు:ఖంలోనూ కొడుకు తనవంతు బాధ్యతగా ఓటేశాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన కాటారాపు కమల అనారోగ్యంతో ఆదివారం ఉదయం చనిపోయింది.
కాగా, ఆమె కొడుకు కాటారపు శ్రీనివాస్ తల్లి చనిపోయిన బాధను దిగమింగి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటేశాడు. విషయం తెలుసుకున్న పలువురు ఆయనను అభినందించారు.
