
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం గ్రామానికి చెందిన పార్థసారథి రెండు రోజుల క్రితం జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతని బ్రెయిన్డెడ్అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పార్థసారథి కళ్లు, గుండె, కిడ్నీలను బుధవారం దానం చేశారు. దీనివల్ల అతను మరో నలుగురిలో జీవించినట్లయింది.