ఆటోలో ఆఫీస్ కు వెళ్తూ కిందపడి యువకుడు మృతి

ఆటోలో ఆఫీస్ కు వెళ్తూ కిందపడి యువకుడు మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఆటోలో ఆఫీస్ కి వెళ్తూ కిందపడి యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ధర్మాపురికి చెందిన మ్యాన సంతోష్ వెల్గటూర్ ఎంపీడీవో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆఫీస్ కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ధర్మపురి మండలం బూరుగుపల్లి సమీపంలోకి వెళ్లగానే ఆటోలో నుంచి కింద పడి మృతి చెందాడు.

సంతోష్ కి పెళ్లి జరిగి ఏడాది అయ్యిందని బంధువులు తెలిపారు.  సంతోష్ మృతితో  భార్య తల్లిదండ్రులు కన్నీరు మున్నిరుగా విలపిస్తున్నారు. ఆటో అజాగ్రత్తగా నడపడం వల్లే సంతోష్ కింద పడి మృతి చెందాడని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.