మద్యం మత్తులో బావిలో పడ్డ వ్యక్తి మృతి ..జగదేవ్ పూర్ లో ఘటన

మద్యం మత్తులో బావిలో పడ్డ వ్యక్తి  మృతి ..జగదేవ్ పూర్ లో ఘటన
  • సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ లో ఘటన

జగదేవ్​పూర్(కొమురవెల్లి), వెలుగు: మద్యం మత్తులో కాలు జారి బావిలో పడి వ్యక్తి చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జగదేవ్ పూర్ మండల కేంద్రానికి చెందిన  రాయరం కనకయ్య(40) కొంతకాలంగా మద్యానికి బానిసగా మారాడు. భర్తను భార్య సుజాత విడిచిపెట్టి తల్లిగారింటికి వెళ్లి ఉంటుంది. ఆదివారం అదే మండలంలోని పీర్లపల్లిలో సోదరి వెంకటమ్మ ఇంటికి వెళ్తున్నట్టు కనకయ్య తల్లి కిష్టమ్మకు చెప్పాడు.

నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యలో నూనె కొమురయ్య బావి వద్దకు ఆగి వెంట తీసుకెళ్లిన మద్యం తాగాడు. కొమురయ్య ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే సోదరి వద్దకు వెళ్తున్నట్టు చెప్పాడు. కాగా.. అక్కడ టాయిలెట్ కు వెళ్లిన కనకయ్య మద్యం మత్తులో బావిలోకి దిగుతుండగా కాలు జారి అందులో పడ్డాడు.  కొద్దిసేపటి తర్వాత కొమురయ్య చూడగా అప్పటికే చనిపోయి కనిపించాడు.

వెంటనే కనకయ్య సోదరికి సమాచారం అందించగా అక్కడి వెళ్లి పోలీసులకు తెలిపారు. ఎస్ఐ చంద్రమోహన్ ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.