పోలీసులను, డాక్టర్లను తోసేసి డెడ్ బాడీతో పరారీ

పోలీసులను, డాక్టర్లను తోసేసి డెడ్ బాడీతో పరారీ

కర్నూలు : పోస్ట్ మార్టం వద్దంటూ డెడ్ బాడీని తీసుకుని పరారయ్యారు మృతుడి కుటుంబ సభ్యులు. ఈ సంఘటన నంద్యాల శనివారం జరిగింది. కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నే గ్రామానికి చెందిన రైతు నారాయణ(18) పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే తమ కుమారుడికి పోస్ట్‌మార్టం అక్కర్లేదంటూ యువకుడి తల్లిదండ్రులు, బంధువులు హస్పిటల్ సిబ్బందితో గొడవకు దిగారు. బైక్‌ పై మృతదేహాన్ని వేసుకొని పరారయ్యారు. వెంటపడ్డ పోలీసులను తోసేసి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడు ప్రేమ విఫలమే సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.