స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మెదక్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామం వద్ద జరిగిందీ ప్రమాదం. చనిపోయిన వ్యక్తి కాళ్లకల్ గ్రామానికి చెందిన  నర్సింహారెడ్డి(50)గా గుర్తించారు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నర్సింహారెడ్డి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.