
పరిగి, వెలుగు: బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. వికారాబాద్జిల్లా దోమ మండలం మల్లేపల్లికి చెందిన దోడ్ల వెంకటయ్య (42) శనివారం రాత్రి కుల్కచర్లలో తన బంధువుల ఇంటికి బర్త్డే వేడుకలకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామ శివారులో అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.