
న్యూఢిల్లీ: బోయింగ్ 747–8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం నుంచి ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. విమాన ప్రమాదానికి 2 గంటల ముందు తాను అదే ఫ్లైట్ లో ప్రయాణించానని ఆకాశ్ వత్సా ‘ఎక్స్’ లో తెలిపాడు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు ఆ విమానంలో జర్నీ చేశానని, ఆ సమయంలోనే విమానంలో తనకు ఏదో తేడాగా ఉందని అనిపించిందని వెల్లడించాడు.
ఫ్లైట్ ఎంటర్ టెయిన్ మెంట్ (విమానంలో ప్రయాణికులకు అందించే సేవలు) సరిగా లేదని, విమానం నంబర్ కూడా మార్చారని తెలిపాడు. ‘‘లండన్ కు వెళ్లాల్సిన ప్యాసింజర్లను మొదట విమానం దిగి డిపార్చర్ గేటు వద్దకు వచ్చారు. మళ్లీ ఫ్లైట్ ఎక్కారు. ఆ టైంలో విమానం నంబర్ మార్చారు” అని వత్సా చెప్పాడు. ఈ మేరకు విమానంలో ఫొటోలు, వీడియో తీసి ఎక్స్ లో షేర్ చేశాడు. తర్వాత వాటిని వత్సా డిలీట్ చేశాడు.