ఓరి దేవుడా.. : మెట్రో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

ఓరి దేవుడా.. : మెట్రో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ స్టేషన్‌లో కదులుతున్న మెట్రో రైలు కింద దూకి 31 ఏళ్ల లైబ్రేరియన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజఫ్​గఢ్ లోని ప్రేమ్​నగర్​కి చెందిన మనీష్​కుమార్​ ఉత్తరాఖండ్​లోని దేవప్రయాగ్​లో లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు. 

నజఫ్​గఢ్​లో ఓ వ్యక్తి మెట్రో ముందు దూకి చనిపోయినట్లు జులై 31 ఉదయం పోలీసులుకు  సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుడేజీలను పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. 

మృతుడికి వివాహమై ఒక కుమార్తె ఉందని సీనియర్​అధికారి ఒకరు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

తరచూ ఆత్మహత్యలు..

ఈ నెల ప్రారంభంలో, కైలాష్ కాలనీ స్టేషన్‌లో మెట్రో రైలు ముందు దూకి 25 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడిని అజయ్ అర్జున్ శర్మగా గుర్తించారు.  జూన్‌లో కూడా ఇక్కడ మెట్రో రైలు ముందు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కావని.. అందరూ ధైర్యంగా ఉంటూ జీవితంలో పోరాడాలని అధికారులు కోరుతున్నారు.