సమోసాలో బల్లి.. తిన్నోళ్లకు వాంతులు.. వీడియో వైరల్

సమోసాలో బల్లి.. తిన్నోళ్లకు వాంతులు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన కొంతమందికి సమోసాలపై ఉన్న ప్రేమను అంతం చేస్తుంది. హాపూర్‌లో సమోసాలో బల్లి కనిపించిన షాకింగ్ సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పండుగ సీజన్‌లో తన ఇంటికి అతిథులు రావడంతో హాపూర్‌లోని చాందీ రోడ్డులో ఉన్న ఓ స్వీట్ షాప్ నుంచి ఒక వ్యక్తి సమోసాలను కొనుగోలు చేశాడు. అతిథులకు సమోసాలు వడ్డించిన తర్వాత.. ఓ వ్యక్తి తన సమోసాలో బల్లిని గమనించాడు. ఈ క్రమంలోనే బాధితురాలి 13 ఏళ్ల కుమార్తె సమోసా తిని అస్వస్థతకు గురైంది.

మొహల్లా న్యూ ఆర్య నగారాలో ఈ ఘటన జరగ్గా, బాధితురాలి ఇంట్లో ఉన్న బంధువులు సమోసాలో బల్లిని చూసి షాకయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో దావానంలా వ్యాపించింది. ఈ విషయమై కుటుంబసభ్యులతో పాటు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఓ వ్యక్తి తన ఇంటి బయట వాంతులు చేసుకుంటున్నట్లు వీడియోలో చూడవచ్చు. బల్లి కనిపించిన సమోసాను మరో వ్యక్తి పట్టుకుని ఉన్నాడు. అతను చనిపోయిన బల్లితో నింపిన సమోసాను కెమెరాకు చూపించి, ఆపై దాన్ని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో ఉంచుతున్నాడు.

బాధితురాలి కుమార్తె రాధిక (13) సమోసా తిన్న తర్వాత పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఘటన అనంతరం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విచారణ జరిపి స్వీట్ షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్వీట్ షాప్ యజమాని మాత్రం కుటుంబం చేసిన వాదనను కొట్టిపారేస్తున్నాడు. సమోసాలో బంగాళాదుంపలు నిండి ఉన్నాయని, సమోసా లోపల బల్లి కనిపించలేదని చెప్పాడు. ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోలీసులు తెలిపారు.