హైదరాబాద్ లోని నాచారంలో ఘోరం జరిగింది. నాచారం పోలిస్ స్టేషన్ పరిధిలోని ఎస్ డీ వైన్స్ ముందు ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం ( నవంబర్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వ్యక్తి పేరు సుమన్ అని.. గుండెపోటు రావడంతో కిందపడి చనిపోయాడని అంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు
వ్యక్తి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుండెపోటు రావడమే సుమన్ మృతికి కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
