బిడ్డ శవాన్ని మోస్తూ 35 కి.మీ. నడిచిండు

బిడ్డ శవాన్ని మోస్తూ 35 కి.మీ. నడిచిండు
  •  పోస్ట్​మార్టం కోసం మోసుకెళ్లిన్రు
  • మధ్యప్రదేశ్​లో దారుణం..నెట్​లో వీడియో

భోపాల్: ఆత్మహత్య చేసుకున్న కూతురి మృతదేహానికి పోస్ట్​మార్టం చేయించడం కోసం ఓ తండ్రి ఏడు గంటలు నడిచిండు. ఇంకొకరిని తోడు తీసుకుని, బిడ్డ శవాన్ని మంచంపై కట్టేసి మోసుకెళ్లిండు. అధికారులు వెహికల్​ను ఏర్పాటు చేయకపోవడం, వెహికల్​ కిరాయిచ్చే స్తోమత ఆ తండ్రికి లేకపోవడమే దీనికి కారణం. మధ్యప్రదేశ్​లోని సింగ్రౌలీ జిల్లాలోని గడాయ్​ విలేజ్​లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 5న గడాయ్​ గ్రామంలో పదహారేండ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు స్పాట్​ను పరిశీలించి, డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం తీసుకురమ్మని చెప్పి వెళ్లిపోయారు. ఆస్పత్రి గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధికారులేమో వెహికల్​ను ఏర్పాటు చేయలే. ప్రైవేటు వెహికల్​కు డబ్బులిచ్చే స్తోమత ఆ తండ్రికి లేదు. దీంతో డెడ్​బాడీని మంచానికి కట్టి, ఊరోళ్ల సాయంతో మోసుకెళ్లిండు. ఆ వీడియో  వైరల్​ అయింది.