ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి

ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో పలువురు ఆఫీసర్లను ట్రాన్స్​ఫర్ చేస్తూ యాజమాన్యం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈఅండ్​ఎం విభాగంలో డీజీఎం, ఎస్ఈ, డీవైఎస్ఈ, ఈఈ, జేఈలు 31 మంది,  పర్సనల్​ విభాగంలో 15 మంది పర్సనల్​మేనేజర్లు, డీవైపీఎంలు, సీనియర్ ​పర్సనల్​ఆఫీసర్లు, ఫైనాన్స్ ​విభాగంలో అడిషనల్ ​జీఎం స్థాయి నుంచి జూనియర్​అకౌంట్స్​ ఆఫీసర్స్ ​స్థాయిలో 11 మందిని  పలు ప్రాంతాలకు సింగరేణి బదిలీ చేసింది.