వంశీని చూస్తుంటే కాకాను చూసినట్టు ఉంది : ప్రేమ్​సాగర్​ రావు

వంశీని చూస్తుంటే కాకాను చూసినట్టు ఉంది : ప్రేమ్​సాగర్​ రావు

వంశీని చూస్తుంటే వాళ్ల తాత కాకా వెంకటస్వామిని చూసినట్టు ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీ అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఇంద్రవెల్లి గిరిజన దండోరా సభ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ​హయాంలో ఓవైపు రైతుబంధు ఇచ్చి, మరోవైపు వడ్ల తరుగు పేరుతో కటింగ్ చేశారని.. 

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ దోపిడీని అరికట్టామని చెప్పారు. నీటి కొరత ఉన్నప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గూడెం లిఫ్టు ద్వారా సాగునీళ్లిచ్చి పంటలను కాపాడామన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 75 శాతం కాంగ్రెస్​కు వస్తే, ఆ గ్రామాలను స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తామని ప్రకటించారు. 

ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి : వినోద్

‘‘మా ఫ్యామిలీ కాంగ్రెస్​కు చేసిన సేవలను గుర్తించి పార్టీ హైకమాండ్ వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా చాన్స్​ఇచ్చింది. వంశీని ఆశీర్వదించండి. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి’’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ కోరారు. కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం రావాలంటే పార్టీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.