- ఎట్టకేలకు తొలగిన ముసుగు
- విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ లీడర్ జగన్మోహన్రావు
కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని ఎట్టకేలకు ఆవిష్కరించారు. పదేండ్ల కింద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా పలు కారణాల వల్ల ఆవిష్కరణకు నోచుకోలేదు. కాగా, గురువారం కాంగ్రెస్లీడర్మంతెన జగన్మోహన్ రావు, మున్సిపల్ మాజీచైర్ పర్సన్ఉప్పలయ్యతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాకా విగ్రహం వద్దకు చేరుకొని ముసుగును తొలగించారు.
విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. కొన్నేండ్లుగా ముసుగు కప్పి ఉంచిన విగ్రహాన్ని ఎట్టకేలకు ఆవిష్కరించడంతో స్థానిక కాంగ్రెస్నేతలు, కాకా అభిమానులు సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్పార్టీ, కాకా వెంకటస్వామి, సీఎం రేవంత్రెడ్డి జిందాబాద్అంటూ కార్యకర్తల నినాదాలతో రైల్వే స్టేషన్పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్అగల్డ్యూటీ రాజు, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.
