మనోజన్న మంచి మనసు.. అనాథ పిల్లలకు ఫ్రీగా 'ఆదిపురుష్' సినిమా టికెట్లు

మనోజన్న మంచి మనసు..  అనాథ పిల్లలకు ఫ్రీగా 'ఆదిపురుష్' సినిమా టికెట్లు


ప్రభాస్ అభిమానులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం.. ‘ఆదిపురుష్‌’. భారీ అంచనాల నడుమ చిత్రం 2023 జూన్‌ 16న రిలీజ్  కానుంది.  రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాముడిగా, హీరోయిన్‌ కృతిసనన్‌.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, హనుమంతుడిగా సన్నీసింగ్‌ నటించారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి

అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూపించడానికి తమకు తోచిన రేంజ్‌లో టిక్కెట్లను బుక్ చేస్తున్నారు కొందరు సెలెబ్రిటీస్.  ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం 10వేల టిక్కెట్లను బుక్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పదివేల టిక్కెట్స్ కొంటున్నట్లుగా  ప్రకటించారు. 

తాజాగా ఈ లిస్టులోకి యంగ్ హీరో మంచు మనోజ్ కూడా చేరాడు.  ఆదిపురుష్ 2500 టికెట్లను బుక్ చేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న అనాథ పిల్లలకు చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంచు మనోజ్–మౌనిక దంపతుల నుంచి ప్రకటన వచ్చింది.  మంచు మనోజ్‌ కు తోడు.. టాలీవుడ్ ఈవెంట్ మేనిజింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు . మరోవైపు ఆదిపురుష్ ఆడే ప్రతి థియేటర్‌లో  హనుమంతుడికోసం ఒక సీటు కేటాయిస్తున్నారు.. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటన చేసింది.