- హీరో మోహన్ బాబు ఇంట్లో గొడవలు
- 100కు కాల్చేసిన మనోజ్
- తామే పరిష్కరించుకుంటామని చెప్పిన మోహన్బాబు
- వెనుదిరిగిన పోలీసులు
- గాయాలతో బంజారాహిల్స్దవాఖానకు మనోజ్
బడంగ్ పేట్ /జూబ్లీహిల్స్, వెలుగు : సినీ నటుడు మోహన్బాబు కుటుంబంలో గొడవలు భగ్గుమన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫాంహౌస్లో ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్100 కు ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు.
తమ కుటుబంలో విబేధాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్బాబు చెప్పడంతో వెళ్లిపోయారు. కాగా, సాయంత్రం మనోజ్బంజారాహిల్స్రోడ్డు నంబరు 12లోని టీఎక్స్ దవాఖానకు తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. మనోజ్మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని ట్రీట్మెంట్చేసిన డాక్టర్లు చెప్పారు. మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు.
సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్తో పాటు ఎక్స్రే తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 24 గంటలు పాటు అబ్వర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పగా, సోమవారం మళ్లీ వస్తానని వెళ్లిపోయారని తెలిసింది. దీనిపై మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డిని వివరణ కోరగా 100 డయల్కు కాల్ వచ్చిందని, పోలీసులు విచారణ జరిపారని, కుటుంబ గొడవ అని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.