
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి మరో వివాదంలో చిక్కుకుంది. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ మండిపడింది. అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు.
ఎన్టీఆర్ విగ్రహంపై ఇటీవల కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడం అనేది శ్రీకృష్ణ భగవానుడిని అవమానించడమేనని, ఇది చాలా హేయమైన చర్యగా ఆమె పేర్కొంది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకురాలిగా దీనిని వెంటనే ఆపేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్టు కరాటే కల్యాణి తెలిపింది.